బూర్గంపహాడ్, సెప్టెంబర్ 9: తెలంగాణలో విద్యాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్లో ప్రభుత్వ విప్ రేగా కాం తారావుతో కలిసి మంత్రి పువ్వాడ కేజీబీవీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మధ్యాహ్న భోజనంతోపాటు పాఠశాలల్లో మెరుగైన మౌలి క సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్, విప్ రేగా.. విద్యార్థినులతో కరచాలనం చేసి విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బూర్గంపహాడ్లోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణం వద్ద నూతన భవనం, ప్రహరీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. నిరుపేదలకు వైద్యం అందించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేసి వైద్య విద్యను మరింత బలోపేతం చేస్తున్నారని అన్నారు.