ఖమ్మం: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పార్టీ విజయానికి పనిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధు మంచి ఆధిక్యంతో విజయం సాధిస్తారని ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. ప్రజల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నంని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణకు డిమాండ్ చేస్తే కేంద్రం పట్టించుకోలేదన్నారు.