హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికుల కల నెరవేరిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని చెప్పారు.
ఇది ఎంతో పెద్ద మనసుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన వరమని కీర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల మంది కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని కొనియాడారు. కార్పొరేషన్ను ప్రభుత్వంలో చేర్చుకోవడం చిన్న విషయంకాదని, ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని కొనియాడారు.