హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మాట ప్రకారం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మికులకు పట్టం కట్టిందని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. విలీనాన్ని ఆమోదిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని చెప్పారు. కార్మికుల 60 ఏండ్ల స్వప్నం నెరవేర్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రవాణాబిల్లు తీసుకొచ్చి రవాణా సంస్థలను వేలం వేస్తుండగా, ఆర్థికంగా దిగజారిన ఆర్టీసీని ఎన్నో రకాలుగా ఆదుకోవడంతోపాటు 43,373 మంది కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. ఈ కీలక సమయంలో ఆ శాఖకు మంత్రిగా ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు.