హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘రైతులకు మూడే గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీకి మా ఊర్లోకి ప్రవేశం లేదు. ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబడ్ద్దార్ రేవంత్రెడ్డి’ అని తెలంగాణ పల్లెలు గర్జిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ను తమ గ్రామ పొలిమేరల్లోకి కూడా రానివ్వబోమని రైతన్నలు తెగేసి చెప్తున్నారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు వేస్తూ స్వ చ్ఛందంగా కాంగ్రెస్పై నిరసన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తం గా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రైతులకు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు తెలిపి నిరసల్లో పాల్గొన్నారు. ఊరూరా రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
దశాబ్దాలుగా అరిగోసపడ్డ తమ బతుకులు ఇప్పుడిప్పు డే కుదుటపడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతున్నదని, తమ కు 24 గంటల ఉచిత కరెంట్ వస్తుం టే చూడలేకపోతున్నదని రైతన్నలు ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎద్దు ఎవుసం లేనోడు.. ఎన్నైనా అంటడు. మా కష్టం తెలిసినోడు 24 గంటల కరెంటు ఇత్తుంటే.. నడిమిట్ల ఈయనకేం నొప్పి’ అని నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడకు చెందిన దోనూరు సుశీల అనే మహిళా రైతు రేవంత్రెడ్డిపై విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లాలో అయితే కొత్తపేటతోపాటు పలు మండలాలు, గ్రామాల్లో ‘కరెంట్ ఇవ్వద్దన్న కాంగ్రెస్ను బహిష్కరిస్తున్నాం’ అని రైతులు బో ర్డులే పెట్టారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ అనుబంధ సంఘాల ప్ర తినిధులు, రైతుబంధు సమితి బా ధ్యు లు నిరసనలు నిర్వహించా రు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.