మునుగోడు, అక్టోబర్ 20: మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ తర్వాత పత్తా లేకుండా పోయిండని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దుయ్యబట్టారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓ వృద్ధురాలిలో కాసేపు ముచ్చటించారు. రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాజగోపాల్రెడ్డి స్వార్థంతో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనే అని పేర్కొన్నారు. పొదుపు, బీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసిందన్నారు.