Minister Prashanth Reddy | కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. భీంగల్ మండలం బాచన్పల్లిలో రూ.3కోట్లతో కొండయ్యకోట హన్మాన్ దేవాలయం నుంచి రహత్నగర్ లింక్రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చని మంత్రికి గ్రామస్తులు డప్పుచప్పుళు, బోనాలతో, గంగపుత్రుల వలలో ఘన స్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక, తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.
బీడువడ్డ భూముల్లో నేడు పుష్కలంగా పంటలు పండుతున్నాయన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కేసీఆర్ పథకాల్ని పెంచి ఇస్తామని అర్రాసు పాట హామీలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని పార్టీ.. తెలంగాణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు ‘కన్న తల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా’ అన్నట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. రైతులను అరిగోస పెట్టిన కాంగ్రెస్ను నమ్మితే మోసపోతామన్నారు. మంచి చేసిన కేసీఆర్కు ప్రజలంతా మద్దతుగా నిలువాలని, మళ్లీ తనను ఆశీర్వదించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.