జగిత్యాల : జగిత్యాలలోని మార్కెట్ కమిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సానుకూలంగా స్పందించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఎమ్మెల్యే కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జగిత్యాల చల్ గల్ పండ్ల మార్కెట్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఇటీవల లక్ష స్క్వేర్ ఫీట్ లలో నిర్మించిన మామిడి, వ్యవసాయ మార్కెట్ లో సీసీ రోడ్లకు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ త్వరితగతిన పూర్తి చేయాలని కోరగా ఈ సమస్యల పరిష్కరానికి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వెల్లడించారు.