హైదరాబాద్ : ఆర్టీసీకి( RTC) రథ చక్రాలు, పునాదులు డ్రైవర్లేనని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar )అన్నారు. గురువారం ఆర్టీసీ కళా భవన్లో ఆర్టీసీ గ్రాండ్ ఫెస్టివల్ చాలెంజ్(RTC Grand Festival Challenge) నిర్వహించారు. ఉత్తమ ఉద్యోగులకు మంత్రి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పురస్కారాలు అందజేశారు.
అలాగే మహాలక్ష్మి స్కీమ్ పేరు మీదుగా మహిళా ఉద్యోగులకు పురస్కారాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా ముందుకెళ్తుందన్నారు. ఉద్యోగుల పీఆర్సీపై సీఎంతో చర్చిస్తానని హామీనిచ్చారు. ఆర్టీసీలో త్వరలోనే నియామకాలు చేపడుతామన్నారు.