హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ విజయంలో సీపీఐ సంపూర్ణ మద్దతు ఉన్నదని, భవిష్యత్తులోనూ తాము కలిసే ముందుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పొన్నం.. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణను వెంటబెట్టుకొని సీపీఐ నాయకులను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్ మగ్ధుం భవన్కు వచ్చారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శాసనసభలో కమ్యూనిస్టు పార్టీలు, అన్ని వర్గాల ప్రజల పక్షాన తాను నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తానని కూనంనేని తెలిపారు.