Minister Ponguleti | సూర్యాపేట, మార్చి 14 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, అందుకే పంటలకు నీళ్లు ఇవ్వలేమని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తేల్చి చెప్పారు. గురువారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్తో కలిసి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
నాగార్జునసాగర్ ఆయకట్టులో మంత్రులు పర్యటిస్తుండటంతో ఎండిపోతున్న పంటలకు నీటి విడుదలపై శుభవార్త చెప్తారని రైతులు ఆశ పడ్డారు. అయితే, ప్రాజెక్టుల్లో నీళ్లు లేనందున తమ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నదని స్పష్టం చేశారు. ‘గత ప్రభుత్వం కారణంగా వర్షాలు పడలేదు. దాంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలకు మా ప్రభు త్వం నీళ్లివ్వలేని పరిస్థితి నెలకొన్నది. నీళ్లు లేకపోతే కొత్తగా వచ్చిన మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
ఇటీవల జలసౌధలో జరిగిన సమావేశంలో కోదాడకు నీళ్లు ఇస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. ఆయన ప్రకటించిన రెం డ్రోజుల్లోనే, మరో మంత్రి పొంగులేటి విరుద్ధ ప్రకటన చేయడం గమనార్హం. వాస్తవానికి 2015 యాసంగిలో సాగర్ జలాశయ నీటి మట్టం 508 అడుగుల్లో ఉన్నా ఎడమ కాల్వ పరిధిలో ఎండిపోతున్న పంటల కోసం నాటి సీఎం కేసీఆర్తో మాట్లాడి అప్పటి జిల్లా మం త్రి జగదీశ్రెడ్డి నీటిని విడుదల చేయించారు.
ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 514 అడుగుల్లో ఉన్నది. గతంలో పోల్చితే 6 అడుగులు ఎక్కువేఉన్నా నీళ్లివ్వలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చె ప్తుండటం గమనార్హం. నిన్న నల్లగొండలో మం త్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా నీళ్లు ఇవ్వలేమని కరాఖండీగా చెప్పారు. దీనిపై ఆయకట్టు రైతు లు మండిపడుతున్నారు. ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తే చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకుంటామని ప్రాధేయపడుతున్నారు.