యాదాద్రి, ఏప్రిల్ 6: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు.
శాస్ర్తోక్తంగా నిత్యపూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు మంగళవారం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలయ్యాయి. ఆలయంలో అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొని మొక్కు లు చెల్లించుకున్నారు.నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. కొండకింద తులసివనంలో గల శిల్పారామంలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు పరిమితిసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు.
రూ. 2,78,326 ఆదాయం
యాదాద్రి ఖజానాకు రూ.2,78,326 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 12,500, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 6,100, సుప్రభాతం ద్వారా రూ. 300, క్యారీబ్యాగుల ద్వారా రూ. 2,200, వ్రతాల ద్వారా రూ. 14,500, కల్యాణకట్ట ద్వారా రూ. 10, 400, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 1,63, 550, వాహనపూజల ద్వారా రూ. 2,900, టోల్గేట్ ద్వారా రూ. 560, అన్నదాన విరాళం ద్వారా రూ.231, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 22, 188, యాదరుషి నిలయం ద్వారా రూ. 24,400, శివాలయం ద్వారా రూ. 1,016, పాతగుట్ట ద్వారా రూ. 1,550తో కలిపి రూ.2,78,326 ఆదాయం వచ్చిందని ఆమె తెలిపారు.
హుండీల ఆదాయం రూ. 57,18,34
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 19 రోజుల హుండీల ఆదా యం రూ. 57 లక్షలు దాటిందని ఈవో ఎన్.గీత తెలిపారు. యాదా ద్రి కొండపై గల హరితహోటల్లో హుండీలను లెక్కించగా నగదు రూ.57,18,34 వచ్చిందని తెలిపారు. మిశ్రమ బంగారం 25 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 500 గ్రాములు వచ్చిందన్నారు.
కొండపైన స్వాగతతోరణం తొలగింపు
యాదాద్రికొండపై ఆటోస్టాండ్ వద్దగల స్వాగత తోరణాన్ని మంగళవారం వైటీడీఏ అధికారులు తొలగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఘాట్రోడ్డు 7 మీటర్ల వెడల్పు ఉండగా మరో 4 మీటర్ల వెడల్పు పెంచుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా నూతనంగా మరో స్వాగతతోరణాన్ని నిర్మించేందుకు వైటీడీఏ చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి కొండకు చేరుకోగానే ద్వారం వద్ద ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తోరణం కనిపించేలా నిర్మించనున్నారు. ఇప్పటికే లడ్డూ, ప్రసాద విక్రయాల కేంద్రాలను తొలగించి ధర్మదర్శనం వద్ద తాత్కాలికంగా నిర్మించారు.
వాటర్ ఫాల్స్ ట్రయల్ రన్..
యాదాద్రికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా లక్ష్మీనరసింహస్వా మి వారి కొండను అధికారులు తీర్చిదిద్దుతున్నారు. కొండ చుట్టూ పూర్తిగా గార్డెనింగ్తో వివిధ రకాల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతున్నారు. యాదాద్రి కొండకు వెళ్లే ప్రథమ ఘాట్ రోడ్డు వద్ద వాటర్ఫాల్స్ ట్రయల్ రన్ నిర్వహించారు.