హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. మంత్రి ఇవాళ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్ల బిజీగా ఉన్నారు. దీంతో తనతో గత కొన్ని రోజుల నుంచి కలిసి తిరిగిన వాళ్లు.. దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.