CM KCR | ఈ నెల 26న వనపర్తిలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సభ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించడంతో పాటు సీఎం కేసీఆర్ సభకు రావాలని ఆహ్వానించారు. సభ విజయవంతంలో ప్రతి ఒక్కరూ క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, పార్టీ నేతలకు దుర్గాష్టమి, దసరా శుభాకాంక్షలు తెలిపారు.