హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వరకు 63.86 లక్షల మందికి రైతుబంధు సొమ్ము జమ చేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కోటి 35 లక్షల ఎకరాలకు సాయం అందగా.. మొత్తం రూ. 6764.94 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మంగళవారం రోజు 10 ఎకరాలు భూమి గల 63,239 మంది రైతులకు రూ. 173.38 కోట్లు పంపిణీ చేశారు. ఇక కేసీఆర్ ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెప్పగలరా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఎనిమిదేండ్ల నుంచి మోదీ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని అడిగారు. దేశాన్ని మోదీ అన్ని రంగాల్లో వెనుకబడేశారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.