వనపర్తి : యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షత కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మందిర సమీక్ష నిర్వహించారు. వనపర్తి సమీకృత కలెక్టరేట్ కాన్ఫరెన్స్ మందిరంలో నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ఉండేందుకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, సాధారణ రకానికి రూ.1940 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు.
వనపర్తి జిల్లాలో 220 కొనుగోలు కేంద్రాలకు అనుమతి ఉండగా.. 171 కేంద్రాలను ప్రారంభించినట్లు మంతి చెప్పారు. ఇప్పటి వరకు 33వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. సకాలంలో మార్కెట్ యార్డుకు ధాన్యం చేరేలా చూడాలని, ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని రెండు, మూడు రోజుల్లో వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు.