వనపర్తి : మత్య్సకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం మదనపురం మండలం సరళ సాగర్ ప్రాజెక్ట్లో ఉచిత చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్యకారుల జీవితాలు మారాయన్నారు. సీఎం కేసీఆర్ మత్స్య సంపదను పెంచేందుకు పెద్ద ఎత్తున నిధులు నిధులు కేటాయించారన్నారు.
కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.