హైదరాబాద్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సారధ్యంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి , గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. పంట నష్టాన్ని పరిశీలించి అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు.