Telangana | హైదరాబాద్ : రైతుల పేరిట రాజకీయం చేయొద్దు అని ప్రతిపక్షాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan reddy ) హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. వర్షాలపై ప్రభుత్వం నాలుగు రోజుల ముందే ప్రజలను, రైతులను అప్రమత్తం చేస్తుంది.
సీఎం కేసీఆర్( CM KCR ) ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో పర్యటించామని తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు చెప్పామని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం చేసే దీక్షలను రైతులు గమనిస్తారు. ఈ ప్రభుత్వం రైతులు, సాగుకు తొలి ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు. ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్తే కాంగ్రెస్ నేతలు ప్రశ్నించలేదు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తో రైతుల్లో విశ్వాసం పెరిగింది అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.