హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రైతులకు సీఎం కేసీఆర్ మేలు చేస్తే.. ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను ఆయన గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. దేశంలో రైతులకు మేలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ రైతులను బతికిస్తే.. కేంద్ర ప్రభుత్వం చంపేస్తుందని మండిపడ్డారు. నల్ల చట్టాలను తెచ్చింది కేంద్రప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. పదేండ్లుగా పంటనష్టం కింద రైతులకు కేంద్రప్రభుత్వం పైసా సాయం చేయలేదని మండిపడ్డారు. రైతుల కోసం పది రూపాయలు అయినా రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకొచ్చారా? అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ అవగాహనతో , ఆలోచన చేసుకొని మాట్లాడాలని సూచించారు. కనీసం సోయి లేకుండా అతడు చేసిన వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదని తెలిపారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఈ పథకాన్ని ఎందుకు ఎత్తేశారో తెలుసుకోవాలని బండి సంజయ్కి సూచించారు. ఈ పథకం కింద నాలుగేండ్లలో బీమా కంపెనీలకు రూ.2,436.3 కోట్లు చెల్లిస్తే, రైతులకు తిరిగి దకింది రూ.1821.1 కోట్లేనని తెలిపారు. ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే బీమా కంపెనీలు రూ.615.19 కోట్లు లబ్ధి పొందాయని, ఇదే లెక్కన చూస్తే దేశమంతా ఎంత లాభపడ్డాయో ఆలోచించాలని చెప్పారు. కేంద్రం నుంచి ఏకాణా తేవడం చేతగాని బండి సంజయ్ రైతుల పంట నష్టం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని విమర్శించారు. పార్టీ అధ్యక్ష పదవిని కాపాడుకునేందుకే బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వరి ధాన్యం కొనాలని కేంద్రాన్ని అడిగితే.. ‘మేము శాటిలైట్ ద్వారా చూశాం అంత వరి సాగు తెలంగాణలో ఎకడ చేశారు’అని అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు బండి సంజయ్ శాటిలైట్, గూగుల్ మ్యాప్ ద్వారా సర్వే చేయించి తెలంగాణలో ఎంత పంట నష్టం జరిగిందో లెక తీసి కేంద్రం నుంచి సాయం తేవాలని మంత్రి నిరంజన్రెడ్డి సవాల్ విసిరారు.