Minister Niranjan Reddy | కేంద్రం నుంచి ఏకాణ తేవడం చేతగాని బండి సంజయ్.. రైతుల పంట నష్టంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. అకాల వర్షాలకు పంటనష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరిహారం ప్రకటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్రెడ్డి ఘాటుగానే స్పందించారు. దేశంలో రైతులకు మేలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అయితే.. రైతులకు ద్రోహం చేసింది మోదీ అని విమర్శించారు. రైతులను బతికించింది కేసీఆర్ అయితే.. రైతులను చంపింది మోదీ కేంద్ర ప్రభుత్వమని మండిపడ్డారు. నల్ల చట్టాలను తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు, జాతికి క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కు తీసుకున్నదని మంత్రి గుర్తు చేశారు.
తెలంగాణ రైతుల అభినందనలు, ఆశీస్సులు పొందుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లుగా పంటనష్టం కింద రైతులకు కేంద్రప్రభుత్వం పైసాసాయం చేయలదేని ఆరోపించారు. రూ.10 రైతుల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకువచ్చారా? అని నిలదీశారు. బండి సంజయ్ అవగాహనతో, ఆలోచన చేసుకుని మాట్లాడాలన్నారు. ఆయన వ్యాఖ్యలను చూసి జనం నవ్వుకుంటున్నారన్న కనీస సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయడం లేదని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనే దాన్ని ఎందుకు ఎత్తేశారు? ప్రశ్నించారు. ఫసల్ బీమా యోజన పథకం కింద బీమా కంపెనీలకు రైతులు చెల్లించేది ఎక్కువ .. రైతులకు దక్కేది పరిహారం తక్కువ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని నాలుగేళ్లు అమలు చేసి బీమా కంపెనీలకు రూ.2,436.3 కోట్లు చెల్లిస్తే రైతులకు తిరిగి దక్కింది రూ.1,821.1కోట్లు అని చెప్పారు. ఒక్కో తెలంగాణ రాష్ట్రం నుంచే బీమా కంపెనీలు రూ.615.19 కోట్లు లబ్ధి పొందితే.. దేశమంతా ఎంత లబ్ధిపొంది ఉండాలని ప్రశ్నించారు. ఇది బీమా కంపెనీలకు తప్ప రైతులకు న్యాయం చేసే పథకం కాదనే వైదొలగిందని, ఇది కేవలం బీమా కంపెనీలకే మేలు చేసే పథకం అని మీకు అర్థం కాలేదా? అని ప్రశ్నించారు. ఈ పథకం మూలంగా బీమా కంపెనీలు లబ్ధిపొందుతున్నాయని పార్లమెంట్లో సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే వివరాలతో సహా వెల్లడించిందన్నారు. సంజయ్ అవగాహన ఉండి మాట్లాడాలని లేదంటే తెచ్చుకోని మాట్లాడాలని హితవు పలికారు. దేశంలో ఎకరానికి రూ.10వేలు పునరావాసం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ అన్నారు.
కనీసం ప్రజలు నవ్వుతున్నారన్న ఆలోచన లేకుండా మీడియా ముందు ఫోజులు కొడుతున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ బండికి బండి, వస్తువుకు వస్తువు అన్నాడని.. తీరా మీడియా ముందు పిల్లమొగ్గలు వేసి ఇన్సూరెన్స్ ఉంటుందిగా అన్నాడరన్నారు. అధ్యక్ష పదవిని కాపాడుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడున్నాడని, తెలంగాణ వరి ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం మేం శాటిలైట్ ద్వారా చూశాం.. తెలంగాణలో సారుగు ఎక్కడ సాగు చేశారని అపహాస్యం చేశారని విమర్శించారు. మరి ఇప్పుడు బండి సంజయ్ కేంద్రంతో శాటిలైట్, గూగుల్ మ్యాప్ ద్వారా సర్వే చేయించి తెలంగాణలో ఎంత పంట నష్టం జరిగిందో లెక్క తీసి కేంద్రం నుంచి సాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నరం లేని నాలుక ఎన్నయినా మాట్లాడుతుంది అన్నట్లు బండి ప్రకటనలున్నాయని, అందుకే సీఎం కేసీఆర్ దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం రావాలని అంటున్నారన్నారు.