హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు మోనగాళ్లే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రం చేత ప్రకటన చేయించాలి.. అంత వరకు దీక్ష చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు యాసంగి పంట కొనుగోలుపై ప్రకటన చేయించాలన్నారు. లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్లు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఒక వేళ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే బీజేపీ దొంగ దీక్షలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.