వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 13: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పేదింట పెళ్లి బాజాలు మోగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలోని క్యాంప్ కార్యాలయంలో 210 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 56 మంది బాధితులకు రూ.26.46 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సం దర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు సాయం అందజేయడం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శమని స్పష్టంచేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన సీఎం కేసీఆర్ వారిని కంటికి రెప్పలా చూసుకొంటున్నారని చెప్పారు. రైతుబంధు కింద 8 విడుతల్లో రూ.50,400 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్టు వెల్లడించారు. సీఎం సహాయనిధి కింద రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.2 వేల కోట్లు అందించిందని చెప్పారు.