వనపర్తి : గాలిమాటలు చెబుతూ ఊర్లు తిరుగుతున్న వారి మాటలు నమ్మవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కిష్టగిరి గ్రామంలో నూతన ఆసరా పింఛన్ కార్డులు అందజేసి మాట్లాడారు.
తెలంగాణ తెచ్చింది కేసీఆర్..నా లాంటి వాళ్లు కొట్లాడినం. మాకు తెలంగాణ అభివృద్ధి జరుగాలని ఆకాంక్ష ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో లేని వారికి ఇక్కడి ప్రాంత ప్రజల గోస, అభివృద్ధి పట్టదు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు.రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు.
రైతుబంధు,రైతుబీమా, కొనుగోలు కేంద్రాలు, పుష్కలంగా నీళ్లు, 24 గంటలు నిరంతర కరెంట్తో అన్నదాతలకు అండగా నిస్తుందన్నారు. అలాగే రైతులు మార్కెట్కు అనుగుణంగా పంటలు వేసేలా చేసి అధిక దిగుబడులు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు.