హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర విస్మరించలేనిదని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
సాయిచంద్ మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) సంతాపం తెలిపారు. తెలంగాణ గొప్ప గొంతుకను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, సాయిచంద్ మృతదేహానికి టీఎస్ఎమ్మెస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాళులర్పించారు. దవాఖానలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేర్ హాస్పిటల్లో సాయిచంద్ మృతదేహానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ నివాళులర్పించారు.