మేడ్చల్ : రైతు వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిజస్వరూపం బయట పడిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy ) ఆరోపించారు.రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని రేవంత్రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress )పార్టీకి, నాయకులకు రైతు వ్యతిరేకులని అనడానికి రేవంత్ మాటాలే నిదర్శనమన్నారు. రైతుల వీలువలు తెలియని కాంగ్రెస్ను రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లను గల్లంతు చేసేలా చూడాలని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రైతాంగాన్ని ఆదుకునేందుకు వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ అన్యాయం చేసేలా చూస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రైతుబంధు(Raitu Bandu) , ఉచిత విద్యుత్ను బందు చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మవద్దని రైతులను కోరారు. రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలరని అమెరికా వెళ్లి పార్టీ ఫండ్ పేరిట దోపిడి చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ తుడుచుపెట్టుకుపోవటం ఖాయమని వెల్లడించారు.