ఘట్కేసర్,ఆగస్టు10 : మాల్లారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని బుధవారం మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. ఘట్కేసర్ మండల ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఈ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
మండలంలోని ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా దాదాపు 15లక్షల రూపాయల విలువ చేసే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ వైకుంఠ రథంమండల ప్రజా పరిషత్ కార్యాయంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచులు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, కాలేరు సురేష్, కొంతం వెంకట్రెడ్డి, యాదయ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేష్, ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావని, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి, ఘట్కేసర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.