మేడ్చల్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): నోట్లకు సీట్లు అమ్ముకోవడమే తప్ప అభివృద్ధి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఏమి తెలుసని మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. ఎంపీగా తన నియోజకవర్గాన్ని పట్టించుకోని రేవంత్ అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలందరూ కళ్లారా చూస్తున్నారని పేర్కొన్నారు. మేడ్చల్లో గురువారం బీఆర్ఎస్పై రేవంత్రెడ్డి చేసిన విమర్శలను మంత్రి మల్లారెడ్డి తిప్పికొట్టారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న రేవంత్ను ప్రజలు ఛీ కొడతున్నారని చెప్పారు.
డంపింగ్ యార్డుకు అనుమతి ఇచ్చిందే కాంగ్రెస్సే
జవహర్నగర్లో డంపింగ్ యార్డుకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. అనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నెత్తిన వేసుకొని వందల కోట్ల నిధులను ఖర్చు చేసి జవహర్నగర్ను అభివృద్ధి చేసిందని అన్నారు. డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు రూ.15 వందల కోట్లతో విద్యుదుత్పత్తి కేంద్రం, రూ.144 కోట్లతో క్యాపింగ్ ఏర్పాటు చేసిందని, చెరువులలో నీటి శుద్ధికి రూ. 2 వందల కోట్లను ఖర్చు చేసిందని వివరించారు. ఈ అభివృద్ధి రేవంత్రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మేడ్చల్లో ఐటీ పార్క్ ఏర్పాటుకు రూ.400 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసి టెండర్లను ఆహ్వానించిందని తెలిపారు.
రేవంత్ రోడ్షోకు స్పందన కరువు..
మేడ్చల్, జవహర్నగర్లో రేవంత్ రోడ్షోలకు స్పందన కరువైందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అందుకే ఆ పార్టీ నాయకులు అసహనానికి గురవుతున్నారని చెప్పారు.