మేడ్చల్ : రోజురోజుకూ విస్తరిస్తున్న నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ), మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) చిత్తశుద్ధితో ఉన్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నియోజక వర్గంలోని ప్రతి మున్సిపాలిటీ,కార్పొరేషన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం నగరం విస్తరించడంతో నగర జనాభా అధిక శాతం శివారు మున్సిపాలటీలలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. శివారు ప్రాంతాలకు(Outskirts) వస్తున్న ప్రజలకు అన్ని వసతులు కల్పించి సౌకర్య వంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. అభివృద్ధి( Development)తో పాటు సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతంగా( Model ) నిలుస్తుందని అన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.ప్రభుత్వం పేద మహిళల ఉపాధి(Employment of poor women) కి ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని వెల్లడించారు. న్యాక్, కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ ఎం.రాజిరెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్,కమిషనర్ వేమన రెడ్డి,ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .