హైదరాబాద్, జూలై 8 (నమస్తేతెలంగాణ): గురుకులాల ఉద్యోగులందరికీ ఒకటో తేదీన వేతనాలు అందేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి లక్ష్మణ్కుమార్ అధికారులను ఆదేశించారు.
గురుకులాల్లో పారదర్శకంగా అడ్మిషన్లు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలపై బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.