హైదరాబాద్, అక్టోబరు 24 (నమస్తే తెలంగాణ): కర్ణాటక రైతుల విద్యుత్తు ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటకలో విద్యుత్తు కోతలు శృతి మించడంతో ఆగ్రహించిన రైతులు ఇటీవల ఒక విద్యుత్తు సబ్స్టేషన్లో మొసళ్లను వదిలారు.
ఈ వీడియోను రీట్వీట్ చేసిన కేటీఆర్.. ‘ముందున్నది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో!’ అంటూ సెటైర్లు వేశారు. కర్ణాటకలో కరెంటు కోసం రైతులు విద్యుత్తు సబ్స్టేషన్లలో మొసళ్లను వదలాలా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో అర్ధరాత్రి దాటిన తరువాత త్రీఫేజ్ కరెంటు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు వినూత్న రీతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.