వరంగల్ : అక్టోబర్ 6వ తేదీన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్ల కోసం శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని రవీవందర్ ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ స్థల పరిశీలన చేశారు.
అధికారులకు పలు చేశారు. మంత్రి కేటీఆర్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తూ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చారని, అందులో వరంగల్ జిల్లాలో సైతం కిటిక్స్ వంటి భారీ పరిశ్రమలను తీసుకొచ్చారన్నారు. కాగా, సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ సురేష్, వివిధ డివిజన్ల బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.