హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్తో పాటు మంత్రులు మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట నుంచి నారాయణపేట జిల్లాకు బయల్దేరనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఇంటిగ్రెటేడ్ కలెక్టర్ కార్యాలయానికి మంత్రులు మహముద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
ఉదయం 11:45 గంటలకు ఇంటిగ్రెటేడ్ వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సఖి సెంటర్ను, 12:45కు సినీయర్ సిటిజెన్ పార్కును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట స్టేడియం గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.