గద్వాల, సెప్టెంబర్13: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.
ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9గంటలకు అలంపూర్ చేరుకొని 100పడకల దవాఖానకు భూమి పూజ చేస్తారు. అక్కడ నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరి 10.15నిమిషాలకు జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలు దేరి 11గంటలకు గద్వాల మండలం గోన్పహాడ్ వద్ద షాదీఖాన నిర్మాణానికి భూమిపూజ, 11.15నిమిషాలకు సంగాల పార్కు ప్రారంభోత్సవం, 12.00గటంలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గ్రంథాలయ భవనం, జూనియర్ కళాశాల కోసం భనవ నిర్మాణానికి శంకుస్థాపన, డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులకు భూమిపూజ, 12:30గంటలకు ఆడిటోరియం నిర్మాణానికి భూమిపూజ, 1:00గంటలకు మార్కెట్ యార్డు ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు భూమి పూజ, 1:30టీఎస్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.
అనంతరం నదిఅగ్రహారం చేరుకుని అక్కడ 2:00గంటలకు పీజీ కళాశాలలో నూతనంగా నిర్మించిన మహిళ వసతి గృహాన్ని ప్రారంభించి, అక్కడే అదనపు తరగతి గదులకు భూమిపూజ చేస్తారు. 2:10లంచ్ అనంతరం 2:45కు అక్కడ నుంచి బయలుదేరి ఆర్వోబీ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో 3:15కు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. 4:15కు సభ ముగియగానే అక్కడి నుంచి హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు మంత్రి కేటీఆర్ బయలు దేరనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ హాజరవుతున్నారు. వీరితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
గద్వాల మున్సిపాలిటీలో ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్తో కలిసి పరిశీలించారు. సంగాల పార్కు పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపన పనులు, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ మురళి, నాయకులు కృష్ణకుమార్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, జాకీర్, వెంకటేశ్, వంశీ తదితరులు ఉన్నారు.