Telangana | హైదరాబాద్ : తలసరి ఆదాయం( Per Capita Income )లో దేశంలోనే తెలంగాణ( Telangana ) నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీతో రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ ఆర్థికంగా అగ్రస్థానంలో నిలుస్తున్నదని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) విజనరీతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,000 మాత్రమే. కానీ సీఎం కేసీఆర్ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,17,000కు ఎగబాకింది. తొమ్మిదేండ్లలోనే అత్యధికంగా 155 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వనప్పటికీ, ఆర్థికంగా అవస్థలు పెడుతున్నప్పటికీ తెలంగాణ మాత్రం ప్రగతిపథం వైపు దూసుకెళుతున్నది. అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్కు అనూహ్య స్పందన లభించింది. ఇది తెలంగాణ సాధించిన ఘనత.. సీఎం కేసీఆర్ పనితీరుకు, నిబద్ధతకు నిదర్శనం… జయహో కేసీఆర్, జయహో బీఆర్ఎస్.. ఇలా అనేక మంది ట్విట్టర్లో తమ అభిప్రాయాలను తెలియజేశారు.
Best performing state under a visionary CM KCR Garu is ranked No. 1 in India 🇮🇳 👍
Per Capita Income of #Telangana has increased by from ₹1,24,000 in 2014-15 to ₹3,17,000 in 2022-23
✅ 155% Growth, Highest 👏
P..S: This performance is despite an inimical Union Govt… pic.twitter.com/C7Aaicrfws
— KTR (@KTRBRS) March 31, 2023