హైదరాబాద్ : తెలంగాణ అన్నింటిల్లోనూ వెలిగిపోతోందని, ఆ వైభవమే కాదు.. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విజయపథంలో దూసుకువెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు.
దేశంలోనే అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి అని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విభజన సమస్యలు పరిష్కారం కానప్పటికీ, కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేనప్పటికీ తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అద్భుతమైన కేసీఆర్ పాలనకు కేటీఆర్ థాంక్యూ చెప్పారు.
We are not just vibrant, we are #TriumphantTelangana 💪
The numbers speak for themselves
❇️ Per Capita income of #Telangana increased by 125% from ₹1,24,104 in 2014 to ₹2,78,833 in 2021
❇️ GSDP increased by 130% from ₹5 Lakh Cr in 2014 to ₹11.54 Lakh Cr in 2021 pic.twitter.com/iOoDNVYTvf
— KTR (@KTRTRS) March 1, 2022