హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై లైంగిక వేధింపు, హత్య వార్త తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యా. నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్టు చేసినప్పటికీ, త్వరగా న్యాయం జరిగేలా చూడాలని హోం మంత్రిని, డీజీపీని అభ్యర్థిస్తున్నా’ అని ట్విట్టర్లో తెలిపారు.