హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లాలో తరతరాల ఎదురుచూపులు ఫలించాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ప్రారంభోత్సవ నేపథ్యంలో శనివారం ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. పచ్చని పాలమూరు ప్రాజెక్టు ఇక వలసలకు కేరాఫ్ కాదని, వ్యవసాయ విప్లవానికి చిరునామా అంటూ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్ ఇదే..
తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ..
పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల!
వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిషృతం!
కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో ..కృష్ణమ్మ జల తాండవం!
శెలిమలే దికైన కాడ ఉద్దండ జలాశయాలు!
బాయిమీద పంపుసెట్లు నడవనిచోట బాహుబలి మోటర్లు!
స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం!
ఆరు జిల్లాలు సస్యశ్యామలం దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం!
నిన్న..పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్లెత్తిన పాలమూరు లేబర్ !
నేడు.. సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్!
నాడు ..నది పకన నేల ఎడారిలా .. ఎండిన విషాదం !
సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం!
బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయం పాలనలో సాహస యజ్ఞం!
ఆటంకాలు, అవరోధాలు అధిగమించి.. ప్రతిపక్షాల కుట్రలు, కేసులు ఛేదించి సవాల్ చేసి సాధించిన విజయం!
నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం అనుమతుల్లో అంతులేని జాప్యం ఐనా.. కేంద్ర సరారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం!
తీరిన దశాబ్దాల నీటి వెత తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..!
ఎన్నెన్నో దశాబ్దాల కల సగర్వంగా సాకారమైన వేళ త్వరలో పంజాబ్నే తలదన్నే మన పాలమూరు రైతన్నలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు
సమైక్య పాలనలో..బీడువారిన పొలాలకు.. దగాపడ్డ ప్రతి రైతు బిడ్డకు.. యావత్ దక్షిణ తెలంగాణ సమాజానికి వచ్చే వందేండ్లకు తిరుగులేని అభయం మన ‘పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు’
ఇది ఎత్తిపోతల పథకం మాత్రమే కాదు..రైతుల జీవితాల్లో వెలుగులు నింపే నవ్యపథం.. సీఎం కేసీఅర్ గారి సంకల్పానికి నిలువెత్తు రూపం
పచ్చని పాలమూరు…ఇక వలసలకు కేరాఫ్ కాదు..వ్యవసాయ విప్లవానికి చిరునామా..
జై కిసాన్..! జై భారత్..!! జై కేసీఆర్..!!!