హైదరాబాద్ : అవును… రాజకీయ నాయకులు కూడా మనుషులే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పదవికి రాజీనామాను ప్రకటించారంటూ న్యూయార్క్ టైమ్స్ ట్విట్టర్లో తెలిపింది. నేను కూడా ఒక మనిషిని. రాజకీయ నాయకులు కూడా మనుషులే.. నేను చేయగలిగినంత చేశాను. చేయగలిగినంత కాలం చేశాను అంటూ తన పదవికి రాజీనామా చేసిన సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని స్పందించారు. ఈ ట్వీట్పై స్పందించిన మంత్రి కేటీఆర్, ఆమె ఎంత దయగల ప్రధాని అంటూ, అవును.. రాజకీయ నాయకులు మనుషులే అంటూ వ్యాఖ్యానించారు.
బాసర త్రిపుల్ ఐటీ ప్రాంగణాన్ని పూర్తి పచ్చదనంగా మార్చే ప్రక్రియగా చురుగ్గా సాగుతోందని, అక్కడి విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే గొప్ప బహుమతి అని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం బాసర త్రిపుల్ ఐటీని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సందర్శించారు. అక్కడ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ట్వీట్ ద్వారా తనిఖీల వివరాలను తెలిపిన అరవింద్ కుమార్ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీలోని 91 ఎకరాల్లో ఏకో పార్క్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు పూర్తి కావచ్చాయి. బాసర త్రిపుల్ ఐటీ 280 ఎకరాల ప్రాంగణం మొత్తాన్ని పచ్చదనం, ల్యాండ్ స్కేపింగ్ చేసే పనులను వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామని అరవింద్ కుమార్ తెలిపారు.
What a graceful Prime Minister she is. And yes, Politicians are Human too 👏 https://t.co/LnQWdoWvnJ
— KTR (@KTRTRS) January 20, 2023