KTR | హైదరాబాద్ : తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు అయినా జాతీయ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకప్పుడు ఎండిపోయిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ నేడు భారతదేశపు ధాన్యాగారంగా మారుతోందని, దేశాభివృద్ధికి దోహదపడే రాష్టాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కేటీఆర్ కోరారు. దీని కోసం కనీసం ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు అయినా జాతీయ హొదా ఇవ్వాలని శుక్రవారం ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. గతంలోనూ జాతీయ హోదా గురించి కేంద్రాన్ని ఆడిగామని, అయితే ఇంత వరకు స్పందించలేదని, మరో సారి అడుగుతున్నామని, తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
A contributing state to Nation’s growth needs to be recognised by Govt of India
Once a parched area today Telangana state is turning into the granary of India
We have requested/demanded Govt of India in the past and once again reiterate that Telangana irrigation projects be… pic.twitter.com/LecLZ79cRg
— KTR (@KTRBRS) May 26, 2023