PSLV-C53 | పీఎస్ఎల్వీ సీ-53 మిషన్ ప్రయోగం విజయవంతంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ధృవ శాటిలైట్ ఆర్బిటల్ డిప్లొయర్ స్పేస్ క్వాలిఫై కావడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ధృవ స్పేస్ బృందానికి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అభినందనలు తెలిపారు. భారతదేశపు తొలి ప్రయివేటు స్పేస్ స్టార్టప్ ధృవ స్పేస్ అని ఆయన పేర్కొన్నారు. ధృవ స్పేస్ తెలంగాణకు గర్వకారణమని కేటీఆర్ స్పష్టం చేశారు. జూన్ 30న ప్రయోగించిన PSLV-C53 యొక్క PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)లో దృవ స్పేస్ సెంటర్ తయారు చేసిన ఉపగ్రహాలు స్పేస్ లోకి ఎగిరాయి.
2012లో ప్రారంభమైన ధృవ స్పేస్కి సీఈవో సంజయ్ నెక్కంటి నాయకత్వం వహిస్తున్నారు. ఇతనితో పాటు చైతన్య దొర, రాహుల్ రవి కుమార్, విశాల్ లత బాలకుమార్, అభయ్ ఏగూర్ , కృష్ణ తేజ బొర్డు సభ్యులుగా ఉన్నారు. ఏడాదికి దాదాపు 300 ఉపగ్రహాలను తయారు చేయగల సామర్థ్యంతో ధృవ స్కేల్లో శాటిలైట్లను తయారు చేయాలని యోచిస్తోంది.
A proud moment for #Telangana as India’s first private space startup @dhruvaspace has space-qualified their Satellite Orbital Deployer on @isro PSLV C53 mission on June 30
Congratulations to the team! pic.twitter.com/A9GA7MdAEY
— KTR (@KTRTRS) July 1, 2022