హైదరాబాద్ : డిసెంబర్ 9వ తేదీని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కజేయకుండా ఆమరణ దీక్షకు పూనుకున్న ఉద్యమ నేత కేసీఆర్ ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసిన రోజు అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపు తిప్పి 60 ఏండ్ల ఆకాంక్షలకు సరికొత్త ఊపిరినిచ్చిన చారిత్రాత్మక మైలురాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.
డిసెంబర్ 9.
స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కజేయకుండా ఆమరణ దీక్షకు పూనుకున్న ఉద్యమ నేత కేసీఆర్ గారి ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసిన రోజు
తెలంగాణ ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపు తిప్పి 60 యేండ్ల ఆకాంక్షలకు సరికొత్త ఊపిరినిచ్చిన చారిత్రాత్మక మైలురాయి! pic.twitter.com/JPcadlDdEZ
— KTR (@KTRTRS) December 9, 2022