KTR | హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ట్వీట్ చేశారు. విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi )పై కేటీఆర్ మండిపడ్డారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ( Coach Factory ), పసుపు బోర్డు( Turmeric Board ), మెట్రో రెండో దశ( Metro Second Phase ) లేదని ప్రధాని చెప్పారు.
ఐటీఐఆర్( ITIR ), గిరిజన యూనివర్సిటీ( Tribal University ), బయ్యాం ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని మోదీ చెప్పారు. తెలంగాణ( Telangana )కు ఏదీ ఇచ్చేది లేదని మోదీ సర్కార్( Modi Govt ) చెప్పిందని కేటీఆర్ వివరించారు. ప్రధాని ప్రాధాన్యతలో అసలు తెలంగాణే లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి..? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి.?? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.