హైదరాబాద్: అనారోగ్య సమస్యతో కన్నుమూసిన హీరో మహేశ్బాబు మాతృమూర్తి ఇందిరాదేవి భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. హీరో మహేశ్ బాబు, సూపర్ కృష్ణను ఓదార్చారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇందిరాదేవి మృతిపట్ల సంతాపం తెలిపారు. మహేశ్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి బుధవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలను ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్తానంలో నిర్వహించనున్నారు.