ములుగు, జూన్ 6 (నమస్తేతెలంగాణ): పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నా రు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నా రు. మంత్రి కేటీఆర్ ఉదయం 10:15 గంటలకు హెలికాప్టర్లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. డిగ్రీ కళాశాల పకనే రూ.65 కో ట్లతో నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, దాని పకనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల పకా భవనాలు, మాడల్ బస్టాండ్ సముదాయానికి, సేవాలాల్ భవనానికి సైతం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మించిన మాడల్ పోలీస్స్టేషన్కు చేరుకొని రూ.12.50 కోట్లతో జిల్లాలో నిర్మించిన 5 పోలీస్ స్టేషన్ల భవనాలను ప్రారంభిస్తారు.