హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లలో (Sircilla) పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో జరుగనున్న యువ ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెండు వేలకు పైగా యువత పాల్గొనే అవకాశం ఉందని నేతలు తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డు నుంచి 50 మంది చొప్పున 39 వార్డులకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు.