హైదరాబాద్ : సోషల్ మీడియా సాధనాలు సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు వేదికలుగా మారడం దారుణమని రాష్ట్ర ఐటీ శాఖ కేటీఆర్ ట్వీట్ చేశారు. అది కూడా గౌరవనీయులైన జర్నలిస్టులను అవమానించడం సరికాదన్నారు కేటీఆర్. జర్నలిస్టులను వేధిస్తున్న ఆ దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహముద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని కేటీఆర్ కోరారు.
అయితే తులసి చందు అనే మహిళా జర్నలిస్టు తనకు జరుగుతున్న అవమానాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకెళ్లారు. తాను మహిళా జర్నలిస్ట్ను కాబట్టి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో వేధిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను ఏకంగా యాక్సిడెంట్ చేస్తారంట అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా తమను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తులసి చందు కేటీఆర్ను కోరారు. దీంతో కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ.. జర్నలిస్టులను వేధిస్తున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
It’s a disgrace that social media has turned into a haven for anti social behaviour and that too against respected journalists
Request HM @mahmoodalitrs Garu and @TelanganaDGP Garu to kindly take stern action on these miscreants https://t.co/mt7hhM1dmW
— KTR (@KTRTRS) April 7, 2022