హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన పల్లెప్రగతి వల్లే ఇది సాధ్యమయిందని చెప్పారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటామని, ప్రశంసలు అందుకుంటామని చెప్పారు.
ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అమలుచేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారులు, 12,769 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
My Compliments to Minister Panchayat Raj & Rural Development @DayakarRao2019 Garu & his team on continuing the terrific performance
Also would like to compliment all the 12,769 Sarpanches, MPTCs & panchayat secretaries for their leadership👏#TelanganaWinsBig #SwachhSarvekshan
— KTR (@KTRTRS) September 23, 2022
స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యాంకు లభించింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ జిల్లాల్లో రాష్ర్టానికి చెందిన జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. దక్షిణ భారత విభాగం ఓవరాల్లో నిజామాబాద్ రెండోస్థానాన్ని దక్కించుకున్నది. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్), వ్యర్థాల నిర్వహణలో సౌత్జోన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తంగా రాష్ర్టానికి వివిధ క్యాటగిరీల్లో 13 స్వచ్ఛ అవార్డులు వరించాయి.