Minister KTR | చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మ లాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు, గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పదేండ్ల క్రితం ఏ చెరువును చూసినా గుండెబరువెక్కిందని, వాటిపై ఆధారపడిన కులవృత్తులకు బతుకుదెరువు లేదన్నారు. కానీ దశాబ్ది ఉత్సవాల వేళ ప్రతి చెరువు.. కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువుగా మారాయని తెలిపారు. చెరువులకు పట్టిన దశాబ్దాల శిలుమును వదిలించిన విప్లవం పేరే మిషన్ కాకతీయ (Mission Kakatiya) అని వెల్లడించారు.
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాకు నచ్చిన ఈ పథకం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసిందన్నారు. పొలిమేరల్లో ఉన్న చెరువును ప్రతి గుండెకు చేరువ చేసిన చరిత్ర ఇదని చెప్పారు. అమృతోత్సవ వేళ మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శమైందని.. అమృత్ సరోవర్ (Amrit Sarovar) రూపంలో దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైందని తెలిపారు. మండువేసవిలో కూడా మత్తడి దుంకుతున్న చెరువుల సాక్షిగా.. ఈ మహాయజ్ఞంలో మనసుపెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికి దశాబ్ది ఉత్సవాల (Telangana Decade Celebrations) సందర్భంగా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ చెరువుల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఒక్క పథకం అనేక ఫలితాలు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. పూడిక మట్టితో పంటపొలాల్లో సారం పెరిగిందని, నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగాయన్నారు. చెరువులపై ఆధారపడ్డ కులవృత్తులకు పూర్వవైభవం లభించిందని చెప్పారు. జీవాలకు, పాడి పశువులకు నీటి కొరత తీరిందన్నారు. పల్లెల్లో పచ్చదనం పెరిగిందని, వాతావరణం మారిపోయిందని తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్ర ప్రభుత్వం చెరువుల కడుపు నింపుతున్నదని వెల్లడించారు.
పదేళ్ల క్రితం…
ఏ చెరువును చూసినా గుండెబరువు
వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువుకానీ..
దశాబ్ది ఉత్సవాల వేళ
ప్రతి చెరువు…
కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువుచుక్కనీరు లేక చిక్కిశల్యమైన
అమ్మలాంటి ఊరి చెరువుకు
ఊపిరిపోసిన నాయకుడు…గొలుసుకట్టు చెరువుల
గోస… pic.twitter.com/RlS40x3CEY— KTR (@KTRBRS) June 8, 2023