హైదరాబాద్: బీజేపీ అంటేనే జుమ్లాలు, అబద్ధాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి, జేపీ నడ్డాకు అబద్ధాలు మాట్లాడటం అలవాటేనని చెప్పారు. మర్రిగూడకు బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2016లో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మునుగోడు నియోజకర్గంలో పర్యటన సందర్భంగా చౌటుప్పల్లో ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఫ్లోరైడ్ బాధితులకు సాయం చేస్తామని, మర్రిగూడలో 300 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఆ హామీల్లో ఎన్పీఏ ప్రభుత్వం ఒక్కటైనా నెరవేర్చిందా అని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ నిలదీశారు.
In 2016, as Union Health Minister @JPNadda Ji promised👇 but did his NPA Govt deliver?
Just Jumlas & Jhoot is what BJP & Nadda is all about https://t.co/QWTE8dgnvN
— KTR (@KTRTRS) October 20, 2022